ఆరేళ్ల బాలిక అనుమానాస్పద మృతి


విజయనగరం: ఆరేళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన విజయనగరం జిల్లా కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. పట్టణంలోని కొత్తపేటలో ఓ ఇంటి బావిలో చిన్నారి మృతదేహంను చూసి స్థానికులు గుర్తించారు. ఇంటి యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలిక సంబంధించిన ఆధారాలు తెలియరాలేదు. దీంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.




 

Read also in:
Back to Top