అమిత్ సింగ్ కు 5 రోజుల కస్టడీ


హైదరాబాద్‌ : నగరంలో సంచలనం సృష్టించిన అక్కచెల్లెళ్ల హత్య కేసులో నిందితుడు అమిత్ సింగ్ ను ఐదురోజులు పోలీస్ కస్టడీకి రంగారెడ్డి కోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. చైతన్యపురిలోని యామిని, శ్రీలేఖలను అతి కిరాతకంగా హత్యచేసిన అమిత్ ను చైతన్యపురి పోలీసులు బుధవారం రంగారెడ్డి జిల్లా కోర్టులో హజరుపరిచారు. ఈ కేసును శుక్రవారం విచారణ చేపట్టిన రంగారెడ్డి కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది.

 




 

Read also in:
Back to Top