కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి


కామారెడ్డి:  నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కామారెడ్డి మండలం రామేశంపల్లి వద్ద గురువారం ఓ క్వాలీస్ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఏడుగురికి గాయలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావు పటేల్ కొడుకు వివాహానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వారు ఆదిలాబాద్ జిల్లా ముదోల్ మండలం తారాపూర్ గ్రామస్తులుగా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

 



 

Read also in:
Back to Top