నల్లగొండ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం


గుర్రం పోడు: నల్లగొండ జిల్లాలో శుక్రవారం మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామ సమీపంలో జరిగింది.


వివరాలు నల్లగొండ నుంచి దేవరకొండ వెళ్తున్న ప్రయాణికుల ఆటో పాల్వాయి సమీపంలోకి చేరుకోగానే దేవరకొండ నుంచి నల్లగొండ వస్తున్న తూఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న కేతపల్లి లక్ష్మమ్మ(50)తో పాటు మరో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




 

Read also in:
Back to Top