అదే జోష్‌తో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’

అదే జోష్‌తో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ - Sakshi


తొలి సీజన్ ముగిసినప్పుడు చాలా మంది బాధపడ్డారు. ఇక నుంచి సాయంత్రాలు ఎలా గడపాలనే సందిగ్ధత నెలకొందని వ్యాఖ్యానించిన ప్రేక్షకులూ ఉన్నారు. మరి ఆ లోటును తీర్చడానికే అన్నట్టుగా మొదలైంది ‘మీలో ఎవరు కోటీశ్వరుడు- సెకండ్ ఎడిషన్’. నటుడు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ క్విజ్ రియాలిటీ షో రెండో దశలో కూడా అంతే జోష్‌తో నడుస్తోంది. సామాన్యులు కూడా పాల్గొనే అవకాశం ఉన్న ఈ షోకి సెలబ్రిటీల తాకిడి కూడా ఉండటంతో మంచి వీక్షకాదరణ దక్కుతోంది.



నాగార్జున తనదైన శైలిలో హోస్ట్‌పాత్రను పోషిస్తూ అనేకమందిని ఈ కార్యక్రమానికి అభిమానులుగా మార్చేస్తున్నారు. రెండో ఎడిషన్‌లో కూడా స్టార్‌ల ఎంట్రీకేమీ లోటు లేదు. నితిన్, రకుల్‌ప్రీత్ సింగ్, సమంత వంటి సెలబ్రిటీలతో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రెండో ఎడిషన్ కలర్‌ఫుల్‌గా కనిపిస్తోంది.

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top