బ్రూమ్.. బ్రూమ్..

బ్రూమ్.. బ్రూమ్..


సానియా మీర్జా టెన్నిస్ కోర్టు దాటి క్లీనింగ్ వైపు వచ్చింది. రాకెట్‌కు బదులుగా చేతిలో చీపురును అందుకుంది. ప్రధాని మోదీ పిలుపునకు స్పందించి స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో తానూ భాగమైంది. తన తండ్రి, సోదరి, సన్నిహితులతో కలిసి గురువారం జూబ్లీహిల్స్ సమీపంలోని ఒక రోడ్డును శుభ్రం చేసింది. సానియా పేరును అనిల్ అంబానీ నామినేట్ చేయగా...ఇప్పుడు సానియా మరో 9 మందిని నామినేట్ చేసింది. వీరిలో క్రీడాకారులతో పాటు నటులు షారుఖ్, రామ్‌చరణ్, మంత్రి కేటీఆర్ కూడా ఉన్నారు.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top