ఆర్ట్ అండ్ ఇరానీ చాయ్
నగర సంస్కృతీ సంప్రదాయాలను అత్యద్భుతంగా కాన్వాస్పై ఆవిష్కరించాడు ప్రముఖ బెంగాలీ చిత్రకారుడు కిషోర్సింగ్. ట్యాంక్బండ్ హోటల్ మారియట్లోని మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో ఆదివారం ఈ చిత్రాలతో ఏర్పాటు చేసిన ‘ఆర్ట్ అండ్ ఇరానీ చాయ్ దుబారా’ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులోని పెయింటింగ్స్ చూస్తుంటే అలనాటి హైదరాబాద్ను గుర్తు చేస్తున్నాయని రాష్ట్ర మంత్రి పద్మారావు అన్నారు. 40 చిత్రాలు కొలువుదీరిన ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 26 వరకు కొనసాగుతుంది.
కవాడిగూడ