ప్యాలెస్లో ఫ్యాషన్ ఫ్లో
విలాసానికి చారిత్రక చిహ్నమైన ఆ వేదిక... వినూత్న ఫ్యాషన్ల వెలుగుల్లో ధగధగలాడింది. నగరానికి చెందిన స్టార్ డిజైనర్ గౌరంగ్షా ఫలక్నామా ప్యాలెస్లో... సమర్పించిన ‘నూర్’ కలెక్షన్స్ ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. సినీ ప్రముఖులు లక్ష్మీ మంచు, రెజీనా, సంజన, నవదీప్, సామ్రాట్ తదితరులు గౌరంగ్ కలె క్షన్స్ను ధరించి మెరిసిపోయారు. షో స్టాపర్గా తళుక్కుమన్న బ్యూటీక్వీన్ దియామీర్జా ఆహూతుల హర్షధ్వానాలు అందుకున్నారు.
మిథాలీరాజ్, మెహక్మూర్తి, రితూవర్మ, సంధ్యారాజు, లావణ్య త్రిపాఠి తదితర విభిన్న రంగాలకు చెందిన ప్రముఖ మహిళామణులు ఈ షోలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు చేయూతని అందించేందుకు ఈ షో ద్వారా వచ్చిన ఆదాయాన్ని వినియోగిస్తామని నిర్వాహకులు చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ సైతం ఆహూతుల్లో ఒకరుగా కనిపించడం విశేషం.
సాక్షి, సిటీ ప్లస్