సంబరంగా ‘సాక్షి’ యాడెక్స్
అడ్వర్టైజింగ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నిర్వహించిన ‘సాక్షి యాడెక్స్’ ఘనంగా జరిగింది. బంజారాహిల్స్ తాజ్ దక్కన్లో నిర్వహించిన ఈవెంట్కు ‘సాక్షి’ మీడియా పార్టనర్గా వ్యవహరించింది. ఈ అవార్డుల పండుగకు 34 ఏజెన్సీల నుంచి 500కు పైగా ఎంట్రీలు వచ్చాయి. పలు యాడ్ ఏజెన్సీలు అవార్డులు అందుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.
కామిక్స్ అశ్విన్, కార్తిక్ పండించిన స్టాండప్ కామెడీకి ఈవెంట్ ప్రాంగణంలో నవ్వుల మతాబులు పేలాయి. స్పాంటేనిటీకి పంచ్లు జోడించి కామిక్స్ సాగించిన కామెడీ జర్నీ ఆద్యంతం ఆకట్టుకుంది. కామెడీ ట్రాక్ అయిపోగానే మొదలైన థ్రిల్లర్ ఎపిసోడ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. గోవాకు చెందిన వెండెల్ అగ్నికీలలతో చేసిన అద్భుత విన్యాసాలు ఈవెంట్ కు స్పెషల్ ఎఫెక్ట్గా నిలిచాయి. చల్లని సాయంత్రం వేళలో జరిగిన యాడెక్స్ అందరినీ ఫుల్గా రీచార్జ్ చేసింది. ఈ కార్యక్రమంలో ‘సాక్షి’ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ డెరైక్టర్ కేఆర్పీ రెడ్డి, వైస్ప్రెసిడెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
స్టాండప్ కామెడీ