2099కే మలేషియా నుంచి హైదరాబాద్ టికెట్!

2099కే మలేషియా నుంచి హైదరాబాద్ టికెట్! - Sakshi


విమానాలనే కాదు, విమాన టికెట్ల ధరలను కూడా ఆకాశం నుంచి భూమ్మీదకు దించిన విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా. త్వరలోనే ఈ సంస్థ హైదరాబాద్ నుంచి కూడా తన సేవలను ప్రారంభించబోతోంది. వారంలో అన్ని రోజులూ హైదరాబాద్ నుంచి మలేషియాకు విమానాలు నడిపించనుంది. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్కు డిసెంబర్ 8వ తేదీ నుంచి ఎయిర్ ఏషియా మలేషియా సేవలు ప్రారంభం అవుతాయని ఆ సంస్థ గ్రూప్ సీఈవో టోనీ ఫెర్నాండెజ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.



దీని ప్రారంభ ఆఫర్లో.. మొత్తం అన్ని పన్నులు కలుపుకొని కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్కు కేవలం రూ. 2099కే టికెట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ కింద అక్టోబర్ 5వ తేదీలోగా టికెట్లు బుక్ చేసుకోవాలి. డిసెంబర్ 8వ తేదీ నుంచి 2015 అక్టోబర్  24వ తేదీ వరకు ప్రయాణాలు చేయొచ్చు. ప్రస్తుతానికి కేవలం బెంగళూరు, చెన్నై, కొచ్చిన్, కోల్కతా, తిరుచిరాపల్లి నగరాల నుంచి మాత్రమే ఎయిర్ ఏషియా విమానాలు నడుస్తున్నాయి.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top