ముఖ కాంతికి... బియ్యం నీళ్లు!

ముఖ కాంతికి... బియ్యం నీళ్లు!


మచ్చలు, మొటిమలు సమస్య ఉంటే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించి ముఖారవిందాన్ని కాంతిమంతంగా మార్చుకోవచ్చు.


3 టేబుల్ స్పూన్ల పిండిలో పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కొబ్బరి నూనె, టీ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా పాలు కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, అర గంట లేదంటే పూర్తిగా ఆరేదాకా ఉంచి శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు రోజూ కూడా ఈ ప్యాక్‌ను వేసుకోవచ్చు.


బియ్యాన్ని నానబెట్టి, బాగా కడిగి.. ఆ నీటిని వేళ్లతో అద్దుకుంటూ ముఖానికి, మెడకు రాస్తూ మృదువుగా మసాజ్ చేయాలి. ఎండవేడికి నిస్తేజంగా మారిన చర్మం తాజాగా మారుతుంది. చర్మం ముడతలు పడటం కూడా తగ్గుతుంది.


మొటిమలు, యాక్నె సమస్య ఉన్నవారు దాల్చిన చెక్కను పొడి చేసి, దాంట్లో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, మృదువుగా రుద్దాలి. యాక్నె  సమస్య తగ్గుతుంది. చర్మం కాంతిమంతం అవుతుంది.


టీ స్పూన్ తేనె, సగం అరటిపండు , పావు కప్పు పెరుగు కలిపి మెత్తటి మిశ్రమం తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి, మృదువుగా రుద్ది, పది నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top