హింస.. అహింస ఒకేసారి ఎదురైతే..?

హింస.. అహింస ఒకేసారి ఎదురైతే..?


మంచు మనోజ్‌ హీరోగా అజయ్‌ ఆండ్రూస్‌ నూతక్కి దర్శకత్వంలో ఎస్‌.ఎన్‌. రెడ్డి, లక్ష్మీకాంత్‌ నిర్మించిన చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’. అనీషా అంబ్రోస్‌ హీరోయిన్‌. సెప్టెంబర్‌ 8న విడుదల కానున్న ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ను శనివారం మంచు లక్ష్మీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ– ‘‘నా తమ్ముడు మనోజ్‌ నటుడిగా నాకెంతో ఇన్‌స్పిరేషన్‌ ఇస్తుంటాడు. కొత్త రకం సినిమాలు, పాత్రలు చేయాలనుకుంటాడు. ‘మనోజ్‌ ఇండస్ట్రీకి ఒక వరం’ అని నేను భావిస్తున్నాను.


దర్శకుడు అజయ్‌ మంచి హార్డ్‌వర్కర్‌. నిర్మాతలకు సినిమాల పట్ల మంచి ప్యాషన్‌ ఉంది’’ అన్నారు. ‘‘నేను రెండు పాత్రలు చేయగలనని నమ్మి నాతో సినిమా చేసిన దర్శకుడు అజయ్, నిర్మాతలకు నా కృతజ్ఞతలు. సినిమా అద్భుతంగా వచ్చింది’’ అన్నారు మనోజ్‌. ‘‘హింస, అహింస అనే రెండు అనుభవాలు ఎదురైతే ఆ పరిస్థితులకు తగ్గట్లు ఎలా ప్రవర్తిస్తారో అలా ఉంటుంది మనోజ్‌గారి క్యారెక్టరైజేషన్‌. ఒక దేశం, రాష్ట్రం, కుటంబంలో పెద్ద ఫెయిల్‌ అయితే ఆ ప్రభావం ఆ సమాజం లేదా ఆ కుటుంబంపై ఎలా ఉంటుందనేదే చిత్రకథ. సినిమా కోసం మనోజ్‌ ఒక దశలో 20 కేజీల బరువు పెరిగారు. ఆ తర్వాత పది కేజీలు తగ్గారు’’ అన్నారు అజయ్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top