రాళ్లను కరిగించే జ్యూస్‌

రాళ్లను కరిగించే జ్యూస్‌


హెల్త్‌ టిప్స్‌



కిడ్నీలో రాళ్లు ఉన్నవారు పడే బాధ వర్ణనాతీతం. ఆపరేషన్‌ చేయించుకునేవరకు ఉపశమనం లభించదు. అయితే కొందరికి ఆపరేషన్‌ చేయించుకున్న తర్వాత కూడా మళ్లీ మళ్లీ రాళ్లు ఏర్పడుతుంటాయి. అలాంటివారు రోజూ నారింజ పండ్ల రసం తీసుకుంటే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చునంటున్నారు వైద్యపరిశోధకులు.నిద్రలేమి చాలా సమస్యలకు దారి తీస్తుంది. అలాగని నిద్రమాత్రలు వాడితే మరిన్ని సైడ్‌ఎఫెక్ట్‌లు వస్తాయి. అందుకోసం ఏం చేయాలంటే రోజూ ఒకటి రెండు కప్పుల దానిమ్మ జ్యూస్‌ తాగాలి. దానివల్ల మంచి ఫలితం ఉంటుంది.

     

పులిపిర్లు పెద్ద సమస్య. ఇవి ఏర్పడటానికి ప్రధాన కారణం వైరస్‌. కొందరు వీటిని గిల్లడం, లాగడం వల్ల కొత్తచోట్లలో కూడా పులిపిర్లు ఏర్పడతాయి. పులిపిర్ల నివారణకు ఇలా చేయడం ఉత్తమం.వెల్లుల్లిపాయలను వొలిచి పులిపిర్ల పైన రుద్దుతూ ఉండాలి. ఉల్లిపాయను సగానికి కోసి మధ్యభాగాన్ని తొలగించి అందులో ఉప్పు నింపాలి. దీనినుంచి వచ్చే రసంతో పులిపిర్లపైన సున్నితంగా రుద్దాలి. అలా దాదాపు నెలరోజులపాటు చేయాలి. బంగాళదుంపను మధ్యకు కోసి ఆ ముక్కలతో రుద్దుతూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా 15, 20 రోజులపాటు చేస్తే పులిపిర్లు ఎండి రాలిపోతాయి.

     

ఆస్తమా ఉన్నవాళ్లు పది నల్లమిరియాలు, రెండు లవంగాలు, గుప్పెడు తులసి ఆకులను తీసుకుని వాటిని మరుగుతున్న నీటిలో వేయాలి. అనంతరం స్టవ్‌ను పావుగంటపాటు సిమ్‌లో ఉంచి నీటిని మళ్లీ మరిగించాలి. ఈ ద్రవాన్ని వడకట్టి ఒక జార్‌లోకి తీసుకుని అందులో రెండు టేబుల్‌ స్పూన్ల తేనె వేయాలి. ద్రవం చల్లారేదాకా ఉంచి దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి ఒకటి రెండు స్పూన్ల ద్రవాన్ని రెండు వారాలపాటు రోజూ సేవించాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top