వైఎస్సార్‌సీపీ బాపట్ల ఎంపీ అభ్యర్థిగా అమృతపాణి

వైఎస్సార్‌సీపీ బాపట్ల ఎంపీ అభ్యర్థిగా అమృతపాణి - Sakshi


 సాక్షి, గుంటూరు : బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా డాక్టర్ వరికూటి అమృతపాణిని ఎంపిక చేశారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు చెందిన ఈయన వైద్యునిగా నియోజకవర్గ ప్రజలకు పరిచితులే.



డాక్టర్ అమృతపాణి సంతనూతలపాడు పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు. అమ్మ  కంటి ఆస్పత్రి నిర్వహిస్తూ, వైద్య వృత్తి  కొనసాగిస్తున్నారు. ఈయన ఎంపిక పట్ల పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు.



 అభ్యర్థి పేరు       :    డాక్టర్ వరికూటి అమృతపాణి

 పార్టీ               :    వైఎస్‌ఆర్ సీపీ

 పుట్టిన తేదీ      :    02-07-1960

 విద్యార్హత         :    ఎంబీబీఎస్, ఎంఎస్ (ఆప్తమాలజీ)

 స్వస్థలం          :    సంతనూతలపాడు, ప్రకాశం జిల్లా

 తల్లిదండ్రులు     :    కోటమ్మ, మాలకొండయ్య

 కుటుంబం        :    భార్య డాక్టర్ బేబీరాణి, పశుసంవర్థకశాఖ అసిస్టెంట్ డెరైక్టర్

 గతానుభవం      :    కంటి వైద్య నిపుణునిగా చీరాల,

                 ఒంగోలులో సేవలు. నాగార్జున యూనివర్సిటీ

                 వారి ప్రతిభా పురస్కార్ గ్రహీత

 రాజకీయ నేపథ్యం     :    వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ

                     సంతనూతలపాడు నియోజకవర్గ

                     సమన్వయకర్తగా పనిచేస్తున్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top