చంద్రబాబును నిలదీయండి:వైఎస్ జగన్

చంద్రబాబును నిలదీయండి:వైఎస్ జగన్ - Sakshi


ప్రకాశం:టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు.ఆనాటి చంద్రబాబు పాలనంతా విశ్వసనీయతకే అర్ధం తెలీకుండా సాగిందని జగన్ విమర్శించారు. జిల్లాలోని సింగరాయకొండ ఎన్నికల రోడ్ షోకు హాజరైన ఆయన.. ఓటుతో తలరాతను మార్చుకుందామని హితవు పలికారు. ఇవాళ ఏ ఒక్క నేతకు విశ్వసనీయతకు అర్ధం తెలీకుండా పోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి రాజకీయాల్ని దిగజార్చరన్నారు.



చంద్రబాబు నాయుడు ఈ రోజు సాధ్యం కాని హామీలను ఇస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, ఆయన తొమ్మిదేళ్ల పాలనలో ఇప్పుడిచ్చే హామీలను ఎందుకు అమలు చేయలేదనిన జగన్ ప్రశ్నించారు. చదువుల కోసం విద్యార్థులు ఎన్నెన్ని అవస్థలు పడుతున్నారో కనీసం చంద్రబాబు తెలుసుకుని ప్రయత్నం చేయలేదన్నారు. మద్యపానాన్నినిషేధిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అనంతరం ఆ విషయాన్నిపక్కకు పెట్టారన్నారు. ఆయన ఇక్కడకు వచ్చినప్పుడు అదే అంశంపై నిలదీయమని ప్రజలకు జగన్ సూచించారు.


 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top