వైఎస్ భారతికి ప్రజల అపూర్వ స్వాగతం
కడప : వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. జగన్, అవినాష్రెడ్డికు మద్దతుగా ప్రచారం చేస్తున్న ఆమెకు ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ఊర్లకు ఊర్ల కదిలివచ్చి స్వాగతాలు పలుకుతున్నారు.
బద్వేల్ నియోజకవర్గంలో భారతి ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. మహానేత పధకాలతో లబ్దిపొందిన వారు వైఎస్ఆర్ను గుర్తుకు తెచ్చుకుంటూ కన్నీరు పెడుతున్నారు. మండుటెండలో తమ కోసం వచ్చిన భారతికి శీతల పానీయలు అందించి మహానేత కుటుంబంపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.