జిల్లాలో 19, 20 తేదీల్లో జగన్ పర్యటన
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్
సాక్షి, నెల్లూరు : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల పర్యటనలో భాగంగా శని, ఆదివారాల్లో జిల్లాలో పర్యటించనున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ గురువారం ఒక ప్రకట నలో తెలిపారు. 19వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు రాపూరు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తార ని పేర్కొన్నారు.
అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ఆత్మకూరు వెళ్లి రాత్రికి అ క్కడే బస చేస్తారని తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆత్మకూరు పాతబస్టాండ్ సెంటర్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటార ని పేర్కొన్నారు. అనంతరం వింజమూరు చేరుకుని సాయంత్రం 4 గంట లకు బస్టాండ్ సెంటర్లో బహిరంగ సభలో ప్రసంగిస్తారని తెలిపారు. తర్వాత ప్రకాశం జిల్లాకు జగన్మోహన్రెడ్డి వెళతారని వెల్లడించారు.