'కష్టపడేవారికి టీడీపీలో స్థానం లేదు'


కష్టపడేవారికి టీడీపీలో స్థానం లేదని ఆ పార్టీ మాజీ నాయకుడు కరణం సోమశేఖర్ రావు మండిపడ్డారు. ఆ పార్టీ అంతా కార్పొరేట్ మయంగా మారిపోయిందని విమర్శించారు. చంద్రబాబుది వైఎస్‌లా నమ్మినవారిని ఆదరించే మనస్తత్వం కాదని, తెలంగాణలో టీడీపీ కనుమరుగవడం ఖాయమని ఆయన అన్నారు.



చంద్రబాబు ఈ ఎన్నికల్లో అమలుకు ఆచరణసాధ్యం కాని హామీలనిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, చంద్రబాబు విధానాలు నచ్చకే తాను ఆ పార్టీని వీడుతున్నానని చెప్పారు. త్వరలోనే తన భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తానని కరణం సోమశేఖర్‌రావు వెల్లడించారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top