టీడీపీయే బీ ఫాం ఇచ్చింది: శైలజానాథ్

టీడీపీయే బీ ఫాం ఇచ్చింది: శైలజానాథ్


శింగనమల కాంగ్రెస్ అభ్యర్థి శైలజానాథ్

 అనంతపురం, న్యూస్‌లైన్: తాను కోరకపోయినా టీడీపీయే బీఫాం ఇచ్చిం దని మాజీ మంత్రి, శింగనమల అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీ నుంచి మారుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. శింగనమల అసెంబ్లీ స్థానానికి టీడీపీ నుంచి బీ ఫాం వచ్చిన మాట వాస్తవమేనని, అది తరిమెల కోనారెడ్డి వద్దే ఇప్పటికీ ఉందన్నారు. తాను టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఇష్టపడటంలేదన్నారు. ఆ పార్టీ తరఫునే నామినేషన్ వేయాలనుకుంటే బహిరంగంగా ప్రకటించేవాడినని చెప్పారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top