ఆరు నామినేషన్లు ఉపసంహరణ


ఏలూరు, న్యూస్‌లైన్: నామినేషన్ల ఉపసం హరణ పర్వం మొదలైంది. మంగళ వారం ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఇద్దరు, నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో నలుగురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున నామినేషన్ వేసిన మాగంటి పద్మవల్లిదేవి, స్వతంత్ర అభ్యర్థి ఈలప్రోలు చంద్రశేఖర్ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్తపల్లి జానకిరామ్, పాలకొల్లులో మేకా శశికళ, చింతలపూడిలో స్వతంత్ర అభ్యర్థి లాగు కుమారి, తాడేపల్లిగూడెంలో తోట మంగాదేవి తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బుధవారం 3గంటల వరకే ఉపసంహరణకు గడువు ఉంది. ఈ పరిస్థితి టీడీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది. ఆ పార్టీ తరఫున చాలాచోట్ల రెబల్స్ బరిలో ఉండటం టీడీపీని వణికిస్తోంది. ఉపసంహరణ పర్వం పూర్తికాగానే ఎక్కడికక్కడ బరిలో ఉన్న అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటారుుస్తారు. తెలుగు అక్షర క్రమంలో అభ్యర్థులకు వాటిని కేటాయిస్తారు. 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top