దుబాయ్ నుంచి వచ్చి ఓటెయ్యనున్న సచిన్
ముంబై: ముంబై ఇండియన్ టీమ్ ఐకాన్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దుబాయ్లో జరుగుతున్న ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్ జట్టుకు సచిన్ మార్గదర్శనం చేస్తున్నారు. దీంతో ఆయన బిజీగా ఉన్నారు.
అయినప్పటికీ దుబాయ్ నుంచి గురువారం నగరానికి వచ్చి లోక్సభ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తూర్పు బాంద్రాలో ఆయన పేరు ఓటరు లిస్ట్లో ఉంది. ఓటు వేసిన అనంతరం తిరిగి మళ్లీ దుబాయ్కి వెళ్లనున్నారు.
సంబంధిత వార్తలు