నేను రీకౌంటింగ్ మంత్రినా? ఆయన ఎన్ కౌంటర్ మంత్రా?
చెన్నై: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ఎదురు దాడిని తీవ్రం చేసింది. ఇప్పటికే బీజేపీ-కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిన ఎన్నికల వేళ.. కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం మరో అడుగు ముందుకేసి మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన (మోడీ) ఒక ఎన్ కౌంటర్ సీఎం. ఒక అబద్ధాల కోరు.నన్ను లెక్కింపు (రీ కౌంటింగ్) మంత్రినని ఆయన అంటున్నారు. మరి ఆయన ఎన్ కౌంటర్ ముఖ్యమంత్రా?' అంటూ ప్రశ్నించారు. తాను రీ కౌంటింగ్ మంత్రినని మోడీ వ్యాఖ్యల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని చిదంబరం తెలిపారు. కాగా మోడీ మాత్రం ఖచ్చితంగా ఎన్ కౌంటర్ ముఖ్యమంత్రే నంటూ విమర్శించారు. ఒకసారి గుజరాత్ లో జరిగిన నకిలీ ఎన్ కౌంటర్ లను మోడీ పరిశీలించుకోవాలంటూ చురకలంటించారు.
2009 లో తమిళనాడు రాష్ట్రంలోని శివగంగ లోక్ సభ నుంచి చిదంబరం స్వల్ప మోజారిటీతో గెలిచిన విషయాన్ని మోడీ తెరపైకి తెచ్చారు. ఆ ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ వివాదానికి దారి తీయడంతో చిదంబరం ను రీ కౌంటింగ్ మంత్రిగా మోడీ అభివర్ణించారు.