మమతకు త్రుటిలో తప్పిన ముప్పు

మమతకు త్రుటిలో తప్పిన ముప్పు - Sakshi


మాల్దా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెన ర్జీకి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రచారం కోసం మాల్దా జిల్లాకు వచ్చిన మమత గురువారం మాల్దాలోని ఓ హోటల్ గదిలో బస చేయగా.. ఆ గదిలో అగ్ని ప్రమాదం సంభవించింది. సాయంత్రం 6:40 గంటలకు ఏసీ నుంచి మంటలు పుట్టి, గదిలోకి వ్యాపించాయని పోలీసులు తెలిపారు.


ప్రమాద సమయంలో బాత్‌రూంలో ఉన్న మమత.. పొగ వాసనను గ్రహించి గట్టిగా కేకలేస్తూ తన అనుచరుడు జయ్‌దీప్‌ను పిలిచారు.   వెంటనే లోపలికి వెళ్లిన జయ్‌దీప్ ఓ దుప్పటిని మమతకు చుట్టి ఆమెను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. మంటల వల్ల గదంతా దట్టంగా పొగ అలుముకుంది. మమత ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు చెప్పారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top