మెదక్, నర్సాపూర్‌లో నేడు కేసీఆర్ పర్యటన

మెదక్, నర్సాపూర్‌లో నేడు కేసీఆర్ పర్యటన - Sakshi


సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు గురువారం మెదక్, నర్సాపూర్‌లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. సాయంత్రం 5.20 గంటలకు మెదక్.. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు నర్సాపూర్‌లో జరిగే బహిరంగ సభలో చంద్రశేఖర్‌రావు ప్రసంగించనున్నారు.



26వ తేదీన  జహీరాబాద్, జోగిపేట, సిద్దిపేటలో నిర్వహించే బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. 27వ తేదీన పటాన్‌చెరు, సంగారెడ్డి పట్టణాల్లో కేసీఆర్ పర్యటిస్తారు. కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలు విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా జనసమీకరణపై ఎమ్మెల్యే అభ్యర్థులు దృష్టి సారించారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top