సార్వత్రిక ఎన్నికలకు ఐపీఎల్ ఫీవర్
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్లైన్: సార్వత్రిక ఎన్నికలకు ఐపీఎల్ ఫీవర్ పట్టుకుంది. అభ్యర్థుల నామినేషన్లకు, ప్రచారానికి ఐపీఎల్ మ్యాచ్లు అడ్డంగా మారాయి. సరిగ్గా ఎన్నికల సమయంలోనే ఈ మ్యాచ్లు కూడా జరుగుతుండడంతో అభ్యర్థులకు యువత అందుబాటులో ఉండడం లేదు. నామినేషన్ల సమయంలో అభ్యర్థులకు నాయకులు, కార్యకర్తలు ఎంత అవసరమో యువత కూడా అంతే అవసరం. ముఖ్యంగా ప్రచారంలో గ్రామీణ ప్రాంతా ల్లో యువత కీలక పాత్ర పోషిస్తున్నారు. జిల్లాలోని తొ మ్మిది అసెంబ్లీ స్థానాలు, విజయనగరం ఎంపీ స్థానం తో పాటు అరుకు, విశాఖ పార్లమెంట్ పరిధిలో కూడా కొన్ని నియోజకవర్గాలు ఉన్నారుు.
ఓటర్లను చైతన్యపరచడం, డబ్బు పంపిణీ, ఓటర్ల అవసరాల గుర్తింపుతో పాటు ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారన్న సరళిని కూడా అభ్యర్థులు యువత ద్వారానే తెలుసుకుం టున్నారు. అరుుతే ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) మ్చాచ్ల పుణ్యమాని యువత అభ్యర్థులకు అం దుబాటులో ఉండడం లేదు. బుధవారం నుంచి ప్రా రంభమైన ఈ మ్యాచ్లు జూన్ 1 వరకూ జరుగుతా రుు. యువతంతా మ్యాచ్లు చూసేందుకు టీవీలకు అతుక్కుపోవడంతో అభ్యర్థులు తమ పార్టీ పనులు చూడాలంటూ ఫోన్లు చేసినా.. వారు ఆసక్తి చూపడం లేదు. సుమారు 45 రోజుల పాటు ఈ మ్యాచ్లు జరగనుండడంతోయువత అభ్యర్థులు దొరికే పరిస్థితి లేదు. ఈలోగా నామినేషన్లు, ఎన్నికలు, లెక్కింపు కూడా పూ ర్తయిపోతుంది. దీంతో అభ్యర్థులు ఐపీఎల్ మ్యాచ్లు ఇప్పుడే రావాలా ..అంటూ వాపోతున్నారు.