పెండింగ్లో గంటా నామినేషన్
అనంతపురం/కర్నూలు/విశాఖపట్నం: టీడీపీ అభ్యర్థుల నామినేషన్లపై పలుచోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆమోదించకుండా పెండింగ్ లో ఉంచారు. గంటా నామినేషన్ పై ఈ మధ్నాహ్నం 3 గంటల తర్వాత ఎన్నికల అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.
అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ అభ్యర్థి ఈరన్న నామినేషన్పై వైఎస్ఆర్ సీపీ అభ్యంతరం చేసింది. ఈరన్నపై కర్ణాటకలో పలు కేసులు ఉన్నాయని, నామినేషన్లో ఆ విషయాలు ప్రస్తావించలేదని ఫిర్యాదు చేసింది. ఎన్నికల అధికారులు ఫిర్యాదును పరిశీలిస్తున్నారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వర్రెడ్డి నామినేషన్పై అభ్యంతరం వ్యక్తమయింది. జయనాగేశ్వర్రెడ్డి సమర్పించిన అఫిడవిట్లో అవకతవకలు ఉన్నాయని అధికారులకు మాజీ కౌన్సిలర్ ఒకరు ఫిర్యాదు చేశారు.