పెండింగ్‌లో గంటా నామినేషన్

పెండింగ్‌లో గంటా నామినేషన్ - Sakshi


అనంతపురం/కర్నూలు/విశాఖపట్నం: టీడీపీ అభ్యర్థుల నామినేషన్లపై పలుచోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆమోదించకుండా పెండింగ్ లో ఉంచారు. గంటా నామినేషన్ పై ఈ మధ్నాహ్నం 3 గంటల తర్వాత ఎన్నికల అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.



అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ అభ్యర్థి ఈరన్న నామినేషన్‌పై వైఎస్ఆర్ సీపీ అభ్యంతరం చేసింది. ఈరన్నపై కర్ణాటకలో పలు కేసులు ఉన్నాయని, నామినేషన్‌లో ఆ విషయాలు ప్రస్తావించలేదని ఫిర్యాదు చేసింది. ఎన్నికల అధికారులు ఫిర్యాదును పరిశీలిస్తున్నారు.



కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వర్‌రెడ్డి నామినేషన్‌పై అభ్యంతరం వ్యక్తమయింది. జయనాగేశ్వర్‌రెడ్డి సమర్పించిన అఫిడవిట్‌లో అవకతవకలు ఉన్నాయని అధికారులకు మాజీ కౌన్సిలర్‌ ఒకరు ఫిర్యాదు చేశారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top