మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటిస్తా: దిగ్విజయ్
హైదరాబాద్: మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటిస్తానని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ తెలిపారు. కేసీఆర్ గురించి తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు అని అన్నారు.
టీఆర్ఎస్ను విలీనం చేస్తామని కేసీఆర్ ప్రకటించినందుకే తాము ఆ అంశాన్ని ప్రస్తావిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఇస్తామన్న హామీకి కట్టుబడే ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చామని అన్నారు. కాంగ్రెస్ ప్రచారం మరింత ఉధృతంగా ఉండాలని ఆశిస్తున్నట్టు దిగ్విజయ్ తెలిపారు.