వారికి ఎవరైనా లెక్కలేదు!
హైదరాబాద్: సికింద్రాబాద్ సీతాఫల్మండిలో మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ వర్గీయుల మధ్య గొడవ జరిగింది. కేంద్ర మంత్రి జైరాం రమేష్ సీతాఫల్మండిలో ప్రచారానికి వెళ్లారు. ఎవరైనా లెక్కలేనట్లు వారు ఆయన ఎదుటే బాహాబాహీకి దిగారు. సీతాఫల్మండి బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత జైరాం రమేష్ అక్కడి నుంచి బయలుదేరారు. అయితే తమ ఇంటికి రావాలంటూ బండ కార్తీకరెడ్డి, చంద్రారెడ్డిలు ఆహ్వానించారు.
సమయాభావంతో జైరాం రమేష్ అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. బండ వర్గం వారికి అడ్డుతగిలారు. ఇది సరైన పద్దతి కాదన్న అంజన్కుమార్ యాదవ్తో వారు వాగ్వివాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎంత నచ్చజెప్పినా బండ వర్గం పట్టించుకోకపోవడంతో పోలీసులు కలగజేసుకుని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించేశారు.