పరువు తీసిన చిరంజీవి ప్రసంగం!

పరువు తీసిన  చిరంజీవి ప్రసంగం! - Sakshi


హొసూరు,   సినీ నటుడు, కేంద్ర మంత్రి చిరంజీవి అవగాహన లోపంతో చేసిన ప్రసంగం కాంగ్రెస్‌ను అభాసుపాలు చేసింది. ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన తమిళనాడులోని హ్రొసూరు, వేపనహళ్లి అసెం బ్లీ నియోజకవర్గాల్లో రోడ్డు షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిరు ప్రసంగం అభ్యర్థులు, నేతలను అయోమయంలో పడేసింది. ప్రజలతో పాటు అభిమానులూ నవ్వుకున్నారు. తన ప్రచారంలో అభ్యర్థులను గెలిపించాలని చెప్పకుండా... షూటింగ్‌ల కోసం ఈ ప్రాంతానికి వచ్చినప్పటి విషయాలను గుర్తుకు తెచ్చుకున్నారు. చిరు ప్రసంగం విన్న కాంగ్రెస్ నేతలు.. ‘‘ఆయన రావడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ’’ అని వాపోయారు.

 మరీ నవ్వులపాలైన అంశాలేంటంటే..:

1. కూడంకుళం కేంద్రాన్ని తాగు, సాగునీటి ప్రాజెక్ట్ అని చెప్పారు. వాస్తవానికిది అణువిద్యుత్ ఉత్పాదక కేంద్రం.  

2..హొసూరు జాతీయ రహదారిని 4 లేన్ల రహదారిగా మార్చింది కాంగ్రెస్సేనన్నారు. ఇది 6 లేన్ల రహదారి. 

3. 65 ఏళ్లలో డీఎంకే, అన్నాడీఎంకేలు రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్ట్ కూడా చేపట్టలేదన్నారు. హొగేనకల్, క ృష్ణా (తెలుగుగంగ) తాగునీటి ప్రాజెక్ట్‌లను తీసుకొచ్చింది ఈ రెండు పార్టీలే.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top