మైక్రోఫైనాన్స్ పేరుతో చంద్రబాబు...
విశాఖపట్నం: మైక్రో ఫైనాన్స్ పేరుతో ప్రజలను మోసం చేసిన ఘనత టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుదని విశాఖ లోక్సభ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి వైఎస్ విజయమ్మ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఇక్కడ మాట్లాడుతూ 9 ఏళ్ల పాలనలో చంద్రబాబు రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని మండిపడ్డారు. అటువంటాయన ఇప్పుడు సింగపూర్ చేస్తాననడం అవివేకం అన్నారు.
విశాఖ అభివృద్ధికి దివంగత మహానేత వైఎస్ఆర్ కన్న కలలను జగన్ నెరవేరుస్తారని ఆమె హామీ ఇచ్చారు. జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు.
కాంగ్రెస్ నేత వాడపల్లి రాంచంద్రరాజు విజయమ్మ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.