ప్రజాగ్రహాన్నిరాహుల్ అంగీకరించాలి:అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ప్రజల్నివెర్రివాళ్లని చేస్తుందన్నకాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువల్నిమంటగలుపుతున్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ప్రజా విశ్వాసం కోల్పోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పై ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారన్నవిషయాన్ని రాహుల్ గాంధీ తప్పక అంగీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ను ఓడించడానికి ప్రజలకు ఇప్పుడు మంచి అవకాశం వచ్చిందని జైట్లీ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ కు ప్రజల్లో దయను కోల్పోకపోయినా, విశ్వాసం మాత్రం కోల్పోయారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ప్రజలు నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారన్నారు. రానున్న ఎన్నికలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.