జిల్లా ఓటర్లు 17,18,784
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్లైన్: జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. జనవరి 31, 2014 నాటి ఓటర్ల ప్రకారం 16,86,020 మంది ఉండగా, ఈ నెల 19 నాటికి ఆ సంఖ్య 17,18,784 చేరుకుంది. ఇటీవల కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించడంతో ఓటర్ల సంఖ్య పెరిగినట్టు కలెక్టర్ కాంతిలాల్ దండే ప్రకటించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్సు హాలులో జరిగిన ఎన్నికల పరిశీలకుల సమావేశంలో కలెక్టర్ ఈ వివరాలను ప్రకటించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏప్రిల్ 19 వరకూ ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించగా కొత్తగా 32,764 మంది చేరారన్నారు. వీరిలో యువ ఓటర్లు ఎక్కువగా నమోదు కావడం విశేషం. అనంతరం ఎన్నికల పరిశీలకులకు జిల్లా భౌగోళిక పరిస్థితులు, ప్రజా జీవనం,ఎన్నికల ప్రక్రియ వంటి అనేక అంశాలపై కలెక్టర్ అవగాహన కల్పించారు. ఎన్నికల్లో పోలింగ్కేంద్రల వివరాలు, వెబ్ కాస్టింగ్, పీఓలు, ఏపీఓ, ఓపీఓ వంటి వివరాలతో పాటు పలు అంశాలను కలెక్టర్ వివరించారు. ఎన్నికల పరిశీలకులు విజయ్ బహుదూర్ సింగ్, దినేష్ కుమార్ సింగ్, అజయ్ శంకర్పాండే, ఎస్పీ తఫ్సీర్ ఇక్బాల్, ఏజేసీ నాగేశ్వరరావు, డీఆర్వో హేమసుందర్, ఇన్ఫర్మేటిక్ ఆఫీసర్ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.