ముంబైలో ఐఎంటీ పూర్వ విద్యార్ధుల సమ్మేళనం
హైదరాబాద్: ఐనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ టెక్నాలజీ(ఐఎంటీ) హైదరాబాద్ పూర్వ విద్యార్ధులు ముంబయిలో కలిసి తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. వివిధ చాప్టర్ల కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఐఎంటీ పూర్వ విద్యార్ధుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న విద్యార్ధులు ముంబయిలోని ఏవియన్ హోటల్ లో సమావేశమై తమ అనుభవాలను నెమరువేసుకున్నారు.
ఎస్ బీఐ లైప్, క్యాపిటల్ ఫస్ట్, క్యాపిటల్ వయా, టాటా కన్సల్టెన్సీ, విడియోకాన్, ఎక్సెల్ డైనమిక్స్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్ డిఎప్ సి బ్యాంక్, డెల్లాయిట్, క్యాప్ జెమినీ, ఈ-క్లార్క్స్ వంటి వివిధ కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్న దాదాపు 35 మంది విద్యార్ధులు ఈ సమ్మెళనంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఐఎంటీ హైదరాబాద్ డైరక్టర్ డాక్టర్ సతీష్ ఐలవాడి మాట్లాడుతూ... పూర్వ విద్యార్దుల అపూర్వ కలయిక విద్యావ్యవస్థ పురోగతికి అత్యంత అవసరమని అన్నారు. పూర్వవిద్యార్ధుల అసోసియేషన్ ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు. ప్రస్తుత విద్యార్ధులు కూడా వీరిని అనుసరించి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు. ఏవిధంగా తాము భవిష్యత్తును తీర్చిదిద్దుకున్నదీ కొందరు పూర్వ విద్యార్ధులు ఈ సందర్భంగా వివరించారు. సమ్మేళనానికి హాజరైన పూర్వ విద్యార్ధులకు జ్ఞాపికలను ఐఎంటీ హైదరాబాద్ తరపున అందజేశారు.