2019లో కాంగ్రెస్దే అధికారం
కొత్తకోట: 2019లో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఏపీ పీసీసీ నేత రఘువీరారెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శనివారం మండల కేంద్రానికి చెందిన తూము రాఘవేందర్ రెడ్డి ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ బీడుభూములకు సాగునీరందుతుందంటే.. అది దివంగత నేత డా. వైఎస్ రాజశేఖర రెడ్డి చలువేనన్నారు. ఆయన హయాంలో చేపట్టిన పెండింగ్ ప్రాజెక్టుల కారణంగానే సాగునీరందుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు రామకృష్ణాపురం మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి,పెంటన్నయాదవ్, సాయిలుయాదవ్, తిరుపతయ్యలు ఉన్నారు.