విద్యార్థులకు వైద్య పరీక్షలు
అమ్రాబాద్ : పదర ప్రాథమిక వైద్యశాల ఆధ్వర్యంలో శనివారం మండలంలోని ఉడిమిళ్ల గిరిజన బాలికల ఆశ్రమపాఠశాల, ఇప్పలపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. మొత్తం 230మంది విద్యార్థులను పరీక్షించి రక్తనమూనాలు సేక వారిలో జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారికి మందులు ఇచ్చారు. ఈ సందర్భంగా వైద్యాధికారి రామకష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలని సూచించారు.