8,9 తేదీల్లో వైఎస్సార్సీపీ ప్లీనరీ
స్టేషన్ మహబూబ్నగర్: ఏపీలోని అమరావతిలో ఈనెల 8, 9 తేదీల్లో వైఎస్సార్ సీపీ ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు ఆపార్టీ జిల్లా అధ్యక్షురాలు బీస మరియమ్మ తెలిపారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్లీనరీని కనివినీ ఎరుగని రీతిలో భారీస్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అపూర్వ ఆదరణ లభిస్తుందన్నారు.
వచ్చే సాధారణ ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అవుతారని తెలిపారు. తెలంగాణలో పార్టీ నిర్ణయాత్మకశక్తిగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్లీనరీకి జిల్లా నుంచి నేతలు, కార్యకర్తలు తరలి వెళుతున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మహ్మద్ హైదర్ అలీ, ట్రేడ్ విభాగం జిల్లా అధ్యక్షుడు వాజిద్, నేతలు సురేష్, నవీన్ కుమార్ పాల్గొన్నారు.