'మునిగే నావలో ఎవరెక్కుతారు'
కడప: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలో తన దుకాణాన్ని అమ్మేసుకున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గురువారం ఆయనిక్కడ మాట్లాడుతూ.. తెలంగాణ టీడీపీ పరిస్థితిపై ప్రజల దృష్టిపెట్టకుండా ఉండేందుకే మైండ్ గేమ్ కు తెరలేపారని విమర్శించారు. దానికి తోడు బాబు మైండ్ గేమ్ కు ఎల్లో మీడియా బాజాలు చరుస్తోందన్నారు.
టీడీపీ కార్యాలయం ఆదేశాల మేరకే ప్రతిపక్షంపై ఎల్లో మీడియాలో వార్తలు వస్తున్నాయని ఆరోపించారు. ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. టీడీపీ మునిగిపోతున్న నావ అని.. అందులో ఎవరెక్కుతారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని నిలదీయడంలో మా సంకల్పం చెదిరిపోదని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.