తమ పార్టీలో చేరడం లేదనే దాడి..
విశాఖపట్నం: పాల్మాన్పేటలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, మత్స్యకారులపై తెలుగుదేశం పార్టీ నేతలు దాడి చేయడాన్ని వైఎస్ఆర్ సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం వైఎస్ఆర్ సీపీ నిజనిర్ధారణ కమిటి పాల్మాన్ పేటలో పర్యటించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ పార్టీలో చేరడం లేదన్న కారణంతోనే తెలుగుదేశం పార్టీ నేతలు ఈ దాడికి దిగినట్లు వైఎస్ఆర్ సీపీ నేతలు తెలిపారు.
మోపీదేవి వెంకటరమణ, కన్నబాబు, దాడిశెట్టి రాజా, కోలా గురువులు తదితరులు పాల్మాన్ పేట బాధితులను కలుసుకొని సంఘటన వివరాలను తెలుసుకున్నారు. కాగా, అంతకుముందు పాల్మాన్పేట పర్యటనకు వెళ్తున్న నిజనిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు తునీ వద్ద అడ్డుకోవడంతో వైఎస్ఆర్ సీపీ సభ్యులు, పోలీసులకు తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది.