రేపు కిర్లంపూడి వెళ్లనున్న వైఎస్ఆర్సీపీ నేతలు
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడికి రేపు(సోమవారం) వైఎస్ఆర్సీపీ నేతలు వెళ్లనున్నారు. మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు తెలిపేందుకు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు తదితర నాయకులు వెళ్లనున్నారు.
కాగా, కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరిన సంగతి తెలిసిందే.