'ఏపీని బీజేపీకి, మోదీకి తాకట్టు పెట్టారు'
గుంటూరు: దోచుకొని, దాచుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తామని ప్రగల్భాలు పలికి, ఇప్పుడు ప్యాకేజీ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు రాష్ట్రాన్ని బీజేపీకి, మోదీకి తాకట్టుపెట్టారని వైఎస్ఆర్ సీపీ నాయకులు ఆరోపించారు. చంద్రబాబు అబద్దాలు చెబుతూ అరచేతిలో వైకుంఠం చూపిస్తూ పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. నాగార్జున యూనివర్సిటీ విద్యార్థి రిషితేశ్వరి కేసులో ప్రిన్సిపల్ బాబూరావును అరెస్ట్ చేయకపోవడం వెనుక కారణమేంటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున ప్రశ్నించారు.