ముద్రగడకు మద్దతుగా అంబటి నిరసన
గుంటూరు: కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్షకు వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు మద్దతు పలికారు. శనివారం ఉదయం గుంటూరులోని ఆయన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి కంచంపై గరిటతో శబ్దం చేస్తూ నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కాపులను బీసీల్లో చేర్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. తమ న్యాయమైన పోరాటానికి ప్రజలంతా మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. శాంతియుత ఆందోళన చేస్తున్న వారిని పోలీసులతో అణచివేయాలని చూస్తున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు వెంటనే ముద్రగడతో చర్చలు జరపాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.