రైతు సమస్యలే అజెండాగా వైఎస్సార్సీపీ పోరు
► సూరారం దీక్ష విజయవంతం చేయాలి
► పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్
సుల్తానాబాద్ రూరల్ (పెద్దపల్లి) : రైతు సమస్యలే అజెండాగా వైఎస్సార్సీపీ రాజీలేని పోరాటం చేస్తోందని పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గుర్రం శ్రీనివాస్గౌడ్ చెప్పారు. సుల్తానాబాద్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 20న మహదేవ్పూర్ మండలం సూరారంలో మేటిగడ్డ భూనిర్వాసితులకు మద్దతుగా చేపట్టే ఒక రోజు దీక్షను విజయవంతం చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు సెగ్గెం రాజేశ్ ఆధ్వర్యంలో జరిగే ఈ దీక్షకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి, నాయకులు హాజరవుతున్నారని చెప్పారు.
రాష్ట్రప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని అన్నారు. రుణమాఫీ పథకం పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. రెండేళ్లుగా సహకార రుణాల వడ్డీపై రిబేట్ అందించడం లేదని తెలిపారు. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పాలకుర్తి రమేష్గౌడ్, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కొమ్మ రాజయ్యయాదవ్, గట్టెపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు పురం రమేష్, నాయకులు క్యాదాసి దేవేందర్, క్యాదాసి ప్రేమ్, అప్పాల మల్లయ్య, సంతోష్, కొక్కిస రాజమల్లుగౌడ్ పాల్గొన్నారు.