వైఎస్ జగన్ ఆరోగ్యంపై విజయమ్మ ఆందోళన

వైఎస్ జగన్ ఆరోగ్యంపై విజయమ్మ ఆందోళన - Sakshi


గుంటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యంపై ఆయన తల్లి వైఎస్ విజయమ్మ ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆయన చేస్తున్న నిరవధిక నిరహార దీక్ష నేటికి నాలుగో రోజుకు చేరిన విషయం తెలిసిందే.  వైఎస్ విజయమ్మ శనివారం దీక్ష స్థలికి వచ్చారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు.  కాగా దీక్ష కారణంగా వైఎస్ జగన్ నీరసంగా కనిపిస్తున్నారని, ఆయన పల్స్ రేటు కూడా గంట గంటకు పడిపోతోందని వైద్యులు తెలిపారు.



మరోవైపు వైఎస్ జగన్‌ చేస్తున్న దీక్షకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. పలుచోట్ల ప్రజలు, నేతలు... స్వచ్ఛందంగా దీక్షకు మద్దతుగా దీక్ష నిర్వహిస్తున్నారు. అలాగే ప్రత్యేకహోదా కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందంటున్నారు విద్యార్థినిలు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరవధిక దీక్షకి కూర్చున్న ఆయనను పలువురు విద్యార్థినీ విద్యార్థులు కలిసి సంఘీభావం తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top