అంబటి కుమార్తె పెళ్లికి వైఎస్ జగన్, పవన్
గుంటూరు: వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కుమార్తె వివాహానికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. గుంటూరులో గురువారం జరిగిన ఈ పెళ్లికి హాజరైన వైఎస్ జగన్ నూతన వధూవరులను ఆశ్వీరందించారు. జనసేన, సినీనటుడు పవన్కల్యాణ్తోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. కాగా, అంతకుముందు నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో మాజీ ఎమ్మెల్యే బొడ్డా బాలకోటిరెడ్డి కాంస్య విగ్రహాన్ని వైఎస్ జగన్ ఆవిష్కరించారు.