నేడు వైఎస్ జగన్ పర్యటన ఇలా...

నేడు వైఎస్ జగన్ పర్యటన ఇలా... - Sakshi


వాకాడు : వరద బాధితులను పరామర్శించేందుకు నెల్లూరు జిల్లాకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. నేడు ఆయన పర్యటన ఇలా సాగనుంది.... బుధవారం ఉదయం వాకాడు పంచాయతీ పరధిలోని గొల్లపాళెం నుంచి కోట మీదగా చిట్టమూరు మండలం మోమిడి గ్రామంలో పర్యటించనున్నారు. అక్కడ నుంచి నేరుగా మనుబోలు మండలం కొలనుకుదురులో బాధితులను పరామర్శిస్తారు.



అక్కడ నుంచి బద్దెవోలు క్రాస్ వద్ద దెబ్బతిన్న జాతీయ రహదారిని పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటలకు నెల్లూరు చేరుకుని మద్రాసు బస్టాండు ప్రాంతంలో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. సాయంత్రం 6 గంటలకు మన్సూర్ నగర్ చేరుకుని వరద ప్రాంతాల్లో పర్యటిస్తారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top