కర్నూలులో వైఎస్ జగన్ కు ఘన స్వాగతం

కర్నూలు చేరుకున్న వైఎస్ జగన్ - Sakshi


కర్నూలు : ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం కర్నూలు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. గుత్తి రోడ్డులోని వీజేఆర్ ఫంక్షన్ హాల్లో జరగనున్న యువభేరీలో వైఎస్ జగన్ పాల్గొంటారు.


ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వల్ల ఒనగూడే ప్రయోజనాలను ఆయన వివరించనున్నారు. అలాగే  ప్రత్యేక హోదాపై యువతలో చైతన్యం తీసుకురావడంతో పాటు వారితో ముఖాముఖి నిర్వహిస్తారు. సుమారు 10వేల మంది సామర్థ్యం కలిగిన కన్వెన్షన్‌ హాలులో ఇందుకోసం  ప్రత్యేక వేదిక ఇప్పటికే రూపుదిద్దుకుంది. మరోవైపు యువభేరి ప్రాంగణం అంతా విద్యార్థులు, యువతతో కిక్కిరిసిపోయింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top