యువతి ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం రామన్నపల్లి గ్రామానికి చెందిన సౌజన్య(22) అనే యువతి కడుపునొప్పికి తాళలేక ఆత్మహత్య చేసుకుంది. గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న సౌజన్య ఆదివారం ఉదయం పురుగులమందు తాగి ఇంట్లో పడిపోయింది. గమనించిన కుటుంబసభ్యులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.