కర్నూలు జేసీఎల్గా ఎల్లారావు
కర్నూలు(రాజ్విహార్): కార్మిక శాఖ కర్నూలు జోన్(కర్నూలు, వైఎస్సార్ కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలు) జాయింట్ కమిషనర్గా కె.ఎల్లారావు నియమితులయ్యారు. గతంలో ఇక్కడ రెగ్యూలర్ జేసీఎల్గా పనిచేసిన ఆర్.చంద్రశేఖరం తెలంగాణకు బదిలీ కావడంతో గత కొంత కాలంగా నెల్లూరు జోన్ జేసీఎల్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. రెగ్యులర్ అధికారిని నియమించే క్రమంలో గుంటూరుకు చెందిన కె.ఎల్లారావును ఇక్కడికి పోస్టింగ్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.అనంతరాము సోమవారం జీఓ 673 జారీ చేశారు. ప్రస్తుతం ఈయన మెడికల్ లీవ్ అనంతరం గత ఆరు నెలలుగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక్కడి పోస్టింగ్ ఇవ్వడంతో మంగళవారం ఆయన ఉద్యోగ బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.