'చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది'
విశాఖపట్నం: రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని వైఎస్ఆర్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సీపీ ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. గుంటూరు జిల్లా మాచర్లలో జరిగే ధర్నాలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా సాధించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని బొత్స విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.