బేల్దారి దుర్మరణం


  • బాత్‌రూమ్‌ స్లాబ్‌ పడి

  • సింగరాయకొండ : ఇంటి మరమ్మతులు చేస్తుండగా పాత బాత్‌రూమ్‌ స్లాబ్‌ మీద పడటంతో బేల్దారి మేస్త్రి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన డ్రైవర్‌ పేటలోని ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లే రహదారిలో మంగళవారం సాయంత్రం జరిగింది.

     

    వివరాలు.. మూలగుంటపాడు పంచాయతీ వెంకటేశ్వర నగర్‌కు చెందిన కసుకుర్తి రజని (35) బేల్దారి మేస్త్రి (పురుషుడే). ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లే రహదారిలో నివాసం ఉండే పఠాన్‌ దరేసాహెబ్‌ ఇంటి మరమ్మతుల పనులకు రజని వెళ్లాడు. బాత్‌రూమ్‌ను నూతనంగా నిర్మించేందుకు గతంలో నిర్మించిన పాత బాత్‌రూమ్‌ను తొలగించే ప్రయత్నంలో ఉండగా ప్రమాదవశాత్తూ బాత్‌రూమ్‌ స్లాబ్‌ పడటంతో రజని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.  

Election 2024

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top